“పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|

0
11

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది.

08-04-2026 ఉదయం 11:00 గంటలకు జే. సాత్విక్ గౌడ్ (వయసు 18 సంవత్సరాలు), విద్యార్థి, కొంపల్లి సాయి కృపా అపార్ట్‌మెంట్స్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 04-04-2026 ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అల్వాల్ లోని లోయోలా కాలేజ్ వెనుక గేట్ వద్ద యెల్లమ్మ ఆలయం దగ్గర తన మామ  గ్లామర్ బైక్ (నంబర్: TS36C6025) ను పార్క్ చేసి పరీక్షకు వెళ్లాడు.

అయితే పరీక్ష ముగిసిన తరువాత ఉదయం 11:30 గంటలకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను దొంగిలించి ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు.

వెతికే క్రమంలో ఆలస్యమవడంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా ఆలస్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగిలించబడిన వాహనాన్ని గుర్తించి తిరిగి పొందేలా చర్యలు చేపట్టారు.

#sidhumaroju

Alwal