బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన అధికారులు

0
1

సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. బుధవారం మామిడిపల్లి జంక్షన్, గాంధీజీ జంక్షన్, బైపాస్ రోడ్డు కూడలిలో తనిఖీలు చేపట్టారు. స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక అనే బోర్డులు ఏర్పాటు చెయ్యడం, రోడ్డు పక్కన ఉన్న పొదలు తొలగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

#RAJESH