మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష రాయచోటికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో చంద్రశేఖర్ను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నియమించారు. చంద్రశేఖర్కు మదనపల్లె తాలూకా, రామసముద్రం, వాయల్పాడు మండలాల్లో ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, పట్టణ శాంతిభద్రతలపై దృష్టి సారించనున్నారు.










