మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అనంతరం వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదవాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.










