డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని DRDA వెలుగు PD శ్రీనివాసపాణి కోరారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం వెలుగు సిబ్బందితో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. డ్వాక్రా, స్త్రీనిధి రుణాలు సకాలంలో రికవరీ చేయాలని కోరారు. మహిళలను అభివృద్ధి చేసేందుకు పని చేయాలన్నారు.
#RAJESH










