మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, నకిలీ విత్తనాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో డిసిపి భాస్కర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, ఎడి సురేఖ, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో, నకిలీ పత్తి విత్తనాల వినియోగంతో రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.










