వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కేవలం వైఎస్సార్ పేరును వాడుకున్నారే తప్ప, ఆయన ఆశయాలను విస్మరించారని మండిపడ్డారు.
జలయజ్ఞం పూర్తి చేయకపోవడం, మద్యపాన నిషేధంపై మాట తప్పడం, బీజేపీకి ‘దత్తపుత్రుడు’గా మారడాన్ని ఆమె తప్పుబట్టారు. 3 రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి ప్యాలెస్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ఆశయాలు, సంక్షేమ పాలన మళ్లీ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.










