12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీర్

0
2

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో మాజీ విప్ బాల్క సుమన్ ఆయనను కలిసి పర్యటనకు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు నస్పూర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం క్యాతన్పల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను సన్మానిస్తారు. పర్యటన విజయవంతం చేయాలని బాల్క సుమన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.