మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.

0
0

మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని, త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు.