ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ సైనికులకు జరగబోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవానికి ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రిక ను బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి అందిస్తున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, ట్రెజరర్ పి యల్లమంద, స్టేట్ కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు,సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, డి వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు.










