మదనపల్లె పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.1 లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత కేసులో పరారీలో ఉన్న వీరిని బసినికొండ వద్ద తనిఖీల సమయంలో ఆర్టీసీ బస్సు దిగి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.










