మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ వ్యాధుల నియంత్రణకు వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందుల దుకాణాల నిర్వాహకులు మందులు విక్రయించాలని ఆదేశించారు. ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి, అందులో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.










