— 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
— రూ. 15 వేల కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడిన ప్రభుత్వం
నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్ను ప్రభుత్వ యంత్రాంగం శనివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విదంగా 861ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులతో కలిసి హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ మార్కట్లో రూ. 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర విభాగాలు ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఇప్పటికే ఇల్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్నపేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు మైకులో అధికారులు మైకు ద్వారా ప్రకటించాయి. దీంతో పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి సహకరించారు. ఇదే సమంలో అక్కడ పాత లే ఔట్లలోని ప్లాట్ల యజమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మా లే ఔట్లను కాపాడుకోడానికి మేమంతా కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు.. కాదు లే ఔట్లు వేశాం ఆ భూమి మాది అని అక్కడి ప్లాట్ల యజమానులు కోర్టులో పోరాడుతున్నారు. మధ్యలో ఎం. ఎ. ముఖీం అనేటోడు వచ్చి అన్యాయంగా ఆ భూములను తెగనమ్ముకోడానికి ఇన్నాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకట్ట వేసిందని హర్షం వ్యక్తం చేశారు.










