ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెలవు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఏప్రిల్ 14 (మంగళవారం) నాడు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఈ మేరకు అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఏప్రిల్ 14న మూసివేయబడనున్నాయి.










