ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఖాసిం వలి మరియు నందవరం. అధ్యక్షులు భీమ శేఖర్. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు.
చేనేత వృత్తిలో ఉన్న వారికి, మగ్గాలు కలిగిన వారికి మరియు చేనేత కార్డులు ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు రేపు *ఉదయం 10 గంటలకు జరగబోయే తీర్ బజార్లో చేనేత.మీటింగ్ జయప్రదం. చేయవలసిందిగా.నాయకులు తెలిపారు .ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ చేనేత కార్మికుల పక్షాన నిలుస్తూ, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు. చేనేత రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు . నందవరం సీనియర్ నాయకులు మస్తాన.మాజీ సర్పంచ్ నర్సప్ప. గ్రామ ఉపాధ్యక్షులు. రెహమాన్.. జొల్లు తిమ్మన్న. శంకర్. పంపయ్య. చేనేత కార్మికులు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని పథకం వివరాలను తెలియజేసి, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.










