సికింద్రాబాద్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తిరుమలగిరి గన్ రాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
శ్రీగణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల స్పూర్తితో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి కాలంలో చలివేంద్రాలు బాటసారులు, ప్రయాణీకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సరితను ఆయన మనస్పూర్తిగా అభినందించారు. కార్యక్రమంలో వార్డు 7 గన్ రాక్ ప్రాంతానికి చెందిన కాలనీల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#sidhumaroju










