పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధమైనట్లు ఆలయ ధర్మకర్త బాల వీరయ్య గారి సోమశేఖర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.










