” ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|

0
11

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్, యాదగిరిగౌడ్, మహేందర్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ భోగేశ్వర్ తో కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు.

స్థానిక ప్రాంతాల్లో వీధి దీపాల అవసరం, పెరుగుతున్న దోమల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అలాగే ఇప్పటికే మంజూరైన పనుల అమలులో జరుగుతున్న ఆలస్యం వంటి కీలక అంశాలను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

డీసీ భోగేశ్వర్ స్పందిస్తూ, అన్ని సమస్యలను సమీక్షించి వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal