చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది సుమారు 12.19 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 16.30 కోట్ల రూపాయలకు చేరింది. లక్ష కుంకుమార్చన, సేవకార్యక్రమాలు, వేద ఆశీర్వాదం, లఘు దర్శనం, పెద్ద భోగం, హుండీ ఆదాయం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులు, దాతలు, అధికార పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఆలయ ఉప కమిషనర్ & ఇవో ఏకంబరం కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.










