మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మల్కాజ్గిరి నియోజకవర్గ ఆలయ కమిటీల సభ్యులు ఆషాడమాసం బోనాలకు ప్రత్యేక నిధులు ఇప్పించాలని వినతి పత్రాలను అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేసి నిధులు మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురామ్ రెడ్డి, జేఏసీ వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, ఫరీద్, జెకె సాయి గౌడ్, బాలకృష్ణ, శంకర్, శ్రీనివాస్, గణేష్, వినీత్, తదితరులు పాల్గొన్నారు.