ఎమ్మెల్యే ని కలిసిన ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ వాసులు

0
14

 మచ్చ బొల్లారం డివిజన్ ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పవన్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎస్వీఎస్ పవన్ రెసిడెన్సి , జనప్రియ ఆర్ యు బి సమీపంలో నాలాలో (సిల్ట్ ) నీటి వ్యర్ధాలుపేరుకుపోవడంతో మురికి నీరు రోడ్లపైకి వస్తుందని నాలాను శుభ్రం చేయాలని, నాలా వెంబడి ఉన్న చెట్టుకొమ్మలు తొలగించాలని, పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని , నాలా వెంబడి ఉన్న కాలనీలలో అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్న భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాటిని నివారించాలని ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్,లక్ష్మణ్ యాదవ్, పవన్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సతీష్, కాలనీవాసులు అభిషేక్, సత్యనారాయణ, రవికుమార్, కృష్ణ చైతన్య, ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.