టిబి ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా

0
2

గూడూరు లో 2 వ సచివాలయం పరిధిలోనీ శ్రీరాముల వారి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన టిబి (క్షయ) వ్యాధి గురించి. టిబి వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, గళ్ళ లో రక్తం పడటం,బరువుతగ్గడం, డయాబెటిస్,60సం పైబడిన వారికి, గళ్ళ పరీక్షలు మరియు మందులు వాడే విధానం గురించి మరియు వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలలకు ఉచితంగా మన గూడూరు పెద్దాసుపత్రి లో మందులు ఇస్తూ ప్రతి నెల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం నెలకు 1000 చొప్పున 6 నెలలకు 6 వేల రూపాయలు పేషెంట్ అకౌంట్ నందు జమ చేయడం జరుగుతుంది. అని టిబి సూపెర్వైసోర్ నాగ మహేంద్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్ ప్రత్యూష .వైస్ ఛైర్మన్ లక్ష్మన్న , కౌన్సిలర్ మద్దిలేటి ,గూడూరు టిబి సూపెర్వైసోర్ నాగ మహేంద్ర ఏ ఎన్ ఎమ్ విజయ కుమారి  ఆశావర్కర్లు పాల్గొన్నారు..