సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత,స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ ,మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు,ముఖ్య నేతలు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
చరిత్రాత్మకమైన మహిమ గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి సేవ చేసుకుందాం. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని మంచి జరిగే ఏర్పాట్లు చేయడానికే ఈ సమీక్ష. దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ ఈవో ని కోరుతున్న, ఆలయం లోపల కేబుల్ వైర్ లు కొత్తవి వేసి ఇబ్బందులు.. ప్రమాదాలుజరగకుండా చూసుకోవాలి. అలాగే భారీ కేడింగ్ జాలి ఏర్పాటు చేయాలి. ఆతిధ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికి తీసి పోరని తెలియజేయాలి. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారికి ఘనమైన ఆతిధ్యం ఇవ్వాలి. ఏ ఏ పండగలు ఆయా ఏరియాలలో జరుగుతున్నందున వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే రెండు సార్లు నీళ్లు ఇవ్వండి. హైదరాబాద్ మొత్తం ఒకే సారి అయితే కొంత ఇబ్బంది ఉంటుంది.. కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుంది. భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి. 3600 దేవాలయాలకు సంబంధించి సమీక్షా సమావేశం రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగింది. గోల్కొండ ,ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట , లాల్ దర్వాజా ఇలా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బోనం ఎత్తుకునే వారే మాకు ప్రథమ ప్రాధాన్యత. బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపి లు వస్తే ఇబ్బందులు ఉండవు. ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. డెక్కన్ మానవ సేవ సమితి , ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయి. అందరూ వారి వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలి.. అన్నారు.