మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము. సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10 గుంటల విలువైన స్థలం, ఒక ఎన్జీవో సంస్థ కి 33 సంవత్సరాల లీజు ఇచ్చే ప్రతిపాదనలను విరమించుకోవాలని ఆ విలువైన స్థలాన్ని కాపాడాలని అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఆషాడమాస బోనాల పండుగకు అధిక నిధులు కేటాయించాలని, నూతన దేవాలయాలకు కూడా నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలోని పెద్ద దేవాలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే దేవాలయాల్లో రంగము పోతురాజుల వీరంగం చేసే దేవాలయాలకు అధిక నిధులు ఇచ్చే విధంగా కృషి చేయాలని.. దేవాదయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి కి వినతి పత్రం అందజేసిన, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అందుకుగాను అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, సురేందర్ రెడ్డి, పవన్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజు, అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.