తెలంగాణ పాలి సెట్ వెబ్ సైట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరిగిపోయిన సీట్ల కేటాయింపులు, వెబ్ ఆప్షన్లకు సంబంధించిన డేటా. పాలిసెట్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్ వాడారా, లేక వెబ్సైట్ను ఎవరైనా హాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నిఘా వర్గాలు రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన పాలిసెట్ సీట్ల కేటాయింపులు కోసం ఎదురుచూస్తున్న 22 వేల మంది విద్యార్థులు. ప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా మొత్తం ఒక్క రాత్రిలో చెరిగిపోవడంతో షాక్ కు గురైన అధికారులు. నిఘా వర్గాల సహాయంతో చెరిగిపోయిన డేటా రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ అధికారులు డేటా రికవర్ చేసినప్పటికీ, స్క్రీన్ మీద కనపడిన కొన్ని సెకన్లలో మళ్లీ చెరిగిపోతుండడంతో, ప్రాధమిక హార్డ్ డిస్క్ లో బగ్స్ ఏర్పడినట్టు గుర్తించిన సాంకేతిక విద్యా విభాగం. దీంతో సీట్ల కేటాయింపులు వచ్చే వారం చేపడతామని తెలిపిన అధికారులు సీట్ల కేటాయింపులో ఆలస్యం కారణంగా విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఉన్నారని, సాంకేతిక విద్యా విభాగ అధికారులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరిన అధికారులు.