మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్
ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుకుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయడం సంతోషకరమైన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మిలో శాది ముబారక్ లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-సిద్దుమారోజు