సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న నాలుగో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రాష్ట్రానికి కొత్త ఆర్థిక లక్ష్యాలను నిర్ధేశించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) ₹18.6 లక్షల కోట్లు సాధించాలని, దాదాపు 17% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా రాష్ట్ర ప్రజల ప్రతి వ్యక్తి ఆదాయం ₹3.47 లక్షలు చేరుకోవడం మరో కీలక లక్ష్యంగా నిర్ణయించారు.
సంక్షేమ పథకాల వేగవంతమైన అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం ద్వారా ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయని సీఎం నమ్మకం వ్యక్తం చేశారు.