మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్. “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల నుండి అక్టోబర్ 2 గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు” రక్తదానం, మరియు వైద్య శిబిరం, “సేవాపక్షం” లాంటి కార్యక్రమాలను బిజెపి నిర్వహిస్తోంది.
అందులో భాగంగా ఈరోజు వెంకటాపురం 135 డివిజన్ కానాజిగూడ పెట్రోల్ పంపు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, చింతల మాణిక్యరెడ్డి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి, భాను ప్రకాష్, మాజీ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మురళి, ఎంపీ సింగ్, రవికిరణ్, సంజయ్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju