తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక చారిత్రక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
30వ సీడ్మెన్ అసోసియేషన్ సదస్సులో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు, రాష్ట్రాన్ని ‘భారతదేశ విత్తన భాండాగారం’ (సీడ్ బౌల్) నుండి ప్రపంచ విత్తన రాజధాని(గ్లోబల్ సీడ్ క్యాపిటల్)గా మార్చే ప్రతిష్టాత్మక ప్రణాళికను వెల్లడించారు.
నాణ్యత, ఉత్పత్తిలో ప్రపంచ ప్రమాణాలను అందుకోవడం ద్వారా అంతర్జాతీయ విత్తన మార్కెట్లో తెలంగాణను కీలక కేంద్రంగా నిలపాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ లక్ష్యం రైతులకు, విత్తన పరిశ్రమకు కొత్త ద్వారాలు తెరుస్తుంది.