తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, దసరా సందర్భంగా రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించారు. ఇటీవల BRS పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆమె, సామాజిక న్యాయాన్ని ప్రధానంగా తీసుకుని 80% పదవులను బడుగు, బలహీన వర్గాలకు కేటాయించారు.
ఎస్టీ నేత లకావత్ రూప్ సింగ్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. కవిత త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టి మేధావులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమవుతారు.
ఈ పర్యటనల ద్వారా మూడో విడత కమిటీకి సూచనలు సేకరించనున్నారు. నియమితులైన సభ్యులు తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆమె సూచించారు. ఈ నియామకాలు తెలంగాణ జాగృతి సామాజిక చైతన్యానికి దోహదపడతాయని భావిస్తున్నారు.