ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ సి. అయ్యన్న పత్రుడు అక్టోబర్ 7 నుంచి 10 వరకు బార్బడోస్లో జరుగనున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు.
ఈ సదస్సులో ఆయన రాష్ట్ర శాఖ తరఫున కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ప్రతినిధిగా హాజరవుతున్నారు. ఈ అంతర్జాతీయ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థల బలోపేతం, సభ్య దేశాల మధ్య అనుభవాల మార్పిడి వంటి అంశాలపై చర్చలు జరుగనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాసనసభల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ఇది గౌరవకరమైన అవకాశం.