తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదలైంది. మొత్తం 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నాలుగైదు ఎంపీటీసీ, జడ్పీటీసీ నియోజకవర్గాలకు కలిపి ఒకే ఆర్వోను నియమించారు. అక్టోబర్ 23న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.