తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ నేడు “చలో బస్ భవన్” పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఉదయం 8:45కి హరీష్ రావు మెహిదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. అలాగే ఉదయం 9 గంటలకు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు సికింద్రాబాద్ నుంచి బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణించి నిరసనలో పాల్గొననున్నారు.
ప్రజలపై భారం మోపే చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం తక్షణంగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమం హైదరాబాద్ నగరంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.