నేడు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ జరగనుంది.
మధ్యాహ్నం 1:45కి ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహించే సీఈవో ఫోరం సమావేశానికి మోదీ, స్టార్మర్ హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:45కి గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
ఈ పర్యటనలో అంతర్జాతీయ ఆర్థిక, టెక్నాలజీ రంగాలపై చర్చలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి నగరం ఈ కార్యక్రమాలకు వేదికగా మారింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.