సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై న్యాయవాది రాకేశ్ కిశోర్ దాడి చేయడానికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన న్యాయవాదికి సుప్రీంకోర్టులోకి ప్రవేశాన్ని రద్దు చేస్తూ చర్యలు ప్రారంభించింది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై న్యాయవాదుల సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.