అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతి నిరాకరణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపిక చేసిన 15–16 మంది పురుష జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ చర్యపై విపక్షాలు, మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పారదర్శకతకు భంగం కలిగించే చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందిస్తూ, తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. మహిళా పాత్రికేయుల హక్కుల పరిరక్షణకు ఇది కీలక అంశంగా మారింది.