అన్నమయ్య జిల్లా ములకలచేరు గ్రామంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
ఐజీ జివిజి అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ బృందం విచారణ చేపట్టనుంది. ఇప్పటివరకు 23 మంది నిందితుల్లో 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జనార్దన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మద్యం బాటిళ్ల మూలాన్ని QR కోడ్ ద్వారా గుర్తించేందుకు “AP ఎక్సైజ్ సురక్ష” యాప్ను సీఎం ప్రారంభించారు. నకిలీ మద్యం తయారీకి ఆఫ్రికా శైలిని అనుసరించినట్లు అధికారులు గుర్తించారు