భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా ఆస్ట్రేలియాపై తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తోంది. గత ఐదు వన్డే ఇన్నింగ్స్ల్లో ఆమె 485 పరుగులు చేసి, సగటు 97.0, స్ట్రైక్ రేట్ 123.72తో ప్రత్యర్థులను అట్టడుగున పడేసింది.
ఈ ఐదు ఇన్నింగ్స్ల్లో మంధానా మూడు శతకాలు, రెండు అర్ధశతకాలు నమోదు చేసింది. ఆమె ఆటతీరు భారత మహిళా జట్టుకు గర్వకారణంగా మారింది.
ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఇంత స్థాయిలో రాణించడం మంధానా స్థాయిని చాటుతోంది. ఆమె ఈ ఫామ్ను కొనసాగిస్తే, భారత మహిళా క్రికెట్కు మరిన్ని విజయాలు ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.