ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసు రాజకీయంగా ముదిరుతోంది. ఈ కేసులో మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు.
“ఇది నారావారి సారా” అని జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు విసురుతూ, చంద్రబాబు నాయుడిపై కక్షతోనే ఈ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
నకిలీ మద్యం దొరికిన వెంటనే జోగి రమేష్ అక్కడికి వెళ్లి చేసిన వ్యాఖ్యలు, అనంతరం జరిగిన పరిణామాలు, కేతిరెడ్డి చేసిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.