హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్రెడ్డిని అధికారికంగా బరిలోకి దింపుతున్నట్లు పార్టీ ప్రకటించింది.
గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ 8న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.
దీపక్రెడ్డి రాజకీయ అనుభవం, స్థానిక పరిచయం బీజేపీకు బలంగా నిలుస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.