Home International ఆగస్ట్‌ 22న నిలిచిన సేవలు నేడు పునఃప్రారంభం |

ఆగస్ట్‌ 22న నిలిచిన సేవలు నేడు పునఃప్రారంభం |

0

భారత్‌ నుంచి అమెరికాకు పోస్టల్‌ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆగస్ట్‌ 22న సాంకేతిక కారణాలతో నిలిపిన అంతర్జాతీయ మెయిల్‌ సేవలను అక్టోబర్ 15న భారత పోస్టల్‌ శాఖ పునరుద్ధరించింది.

ఈ సేవల ద్వారా అమెరికాలోని భారతీయులు తమ కుటుంబ సభ్యుల నుంచి లేఖలు, పార్సెల్‌లు, డాక్యుమెంట్లు అందుకోవచ్చు. హైదరాబాద్‌ ప్రధాన పోస్టాఫీసు నుంచి మొదలైన ఈ సేవలు, ఇతర మెట్రో నగరాల ద్వారా కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

USPS సహకారంతో ఈ సేవలు మరింత వేగంగా, భద్రంగా అందించనున్నట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు ఇది శుభవార్తగా మారింది.

NO COMMENTS

Exit mobile version