మహారాష్ట్ర పల్ఘర్ జిల్లాలోని ముంబయి–అహ్మదాబాద్ నేషనల్ హైవేపై అక్టోబర్ 14న భారీ ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. సుమారు 70 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి.
ఈ గందరగోళంలో 12 స్కూల్ బస్సులు, 500కి పైగా చిన్నారులు చిక్కుకుపోయారు. వీరు విరార్ సమీపంలోని పిక్నిక్ స్పాట్ నుంచి తిరిగి వస్తుండగా, వాసాయ్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. సాయంత్రం 5.30 గంటల నుంచి తెల్లవారుజామున వరకు పిల్లలు ఆహారం, నీరు లేకుండా బస్సుల్లోనే ఉండాల్సి వచ్చింది.
తల్లిదండ్రులు ఆందోళన చెందగా, స్థానిక స్వచ్ఛంద సంస్థలు నీరు, సహాయం అందించాయి. అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేయడంలో తీవ్రంగా శ్రమించారు.