విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆంధ్రా పెట్టుబడులకు కారం ఎక్కువే.. ఏపీ వంటకాలు ఘాటు ఎక్కువని అంటారు. మన పెట్టుబడులు కూడా అలాగే ఉన్నాయి.
కొంత మంది పొరుగువారికి ఇప్పటికే ఆ సెగ తగులుతోంది’’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో గూగుల్ పెట్టుబడి ప్రాజెక్ట్ రాష్ట్రానికి భారీ ఆర్థిక లాభాలను తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది.
పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని లోకేశ్ వ్యాఖ్యలు సంకేతంగా నిలిచాయి. ఈ అభివృద్ధి దిశలో రాష్ట్రం వేగంగా దూసుకుపోతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.