మెగాస్టార్ చిరంజీవి ఇంట ఈ ఏడాది దీపావళి వేడుకలు సినీ తారలతో కళకళలాడాయి. హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంబరానికి నాగార్జున, వెంకటేష్, నయనతార తదితరులు హాజరయ్యారు.
ఒకే ఫ్రేమ్లో చిరు, నాగ్, వెంకీ మధ్య నయనతార కనిపించడం అభిమానులను ఆనందానికి గురిచేసింది. మెగా ఫ్యామిలీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిశారు. చిరంజీవి కుటుంబం నిర్వహించిన ఈ వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫోటోలు, వీడియోలు అభిమానుల చేత షేర్ అవుతూ ట్రెండింగ్లోకి వచ్చాయి. హైదరాబాద్ సినీ వర్గాల్లో దీపావళి వేడుకల హంగామా చర్చనీయాంశంగా మారింది.