ఇ-కామర్స్ వెబ్సైట్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ మోసాలు పెరుగుతున్నాయి. ఫేక్ ఆఫర్లు, బాస్కెట్ స్నీకింగ్, ఫోర్స్డ్ సబ్స్క్రిప్షన్ వంటి డిజైన్ మోసాల ద్వారా వినియోగదారులు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతోంది.
హైదరాబాద్ జిల్లాలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) చర్యలు ప్రారంభించింది. డార్క్ ప్యాటర్న్స్ నివారణకు 2023లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
ఫిర్యాదు చేయాలంటే consumerhelpline.gov.in ద్వారా లేదా 1915 నంబర్కు కాల్ చేయవచ్చు. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.