రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అక్టోబర్ 22న ట్రంప్ ప్రభుత్వం రష్యా అతిపెద్ద చమురు సంస్థలు Rosneft, Lukoil పై భారీ ఆంక్షలు విధించింది.
ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు ఒత్తిడి పెంచే లక్ష్యంతో తీసుకున్న చర్యలుగా పేర్కొనబడ్డాయి. ట్రంప్ మాట్లాడుతూ “ఇది చాలా పెద్ద నిర్ణయం, శాంతి కోసం తీసుకున్న చర్య” అని తెలిపారు.
అమెరికా ఖజానా శాఖ ఈ ఆంక్షలను ధృవీకరించింది. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్తో సమావేశంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ చర్యలు యుద్ధ ముగింపుకు మార్గం సుగమం చేస్తాయన్న ఆశాభావం వ్యక్తమైంది.