తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మొదట రాజేంద్రనగర్లో శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారి మనుమరాలు శృతి వివాహ వేడుకకు హాజరయ్యారు.
అనంతరం హిమాయత్సాగర్లో కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
చివరగా హైటెక్స్లో ఎమ్మెల్సీ సీహెచ్ అంజిరెడ్డి గారి కుమారుడు అనిష్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి హాజరుతో ఈ వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.




