హైదరాబాద్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 2025 అక్టోబర్ 24 నాటికి 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు ₹12,507 కాగా, 22 క్యారెట్ ధర ₹11,464గా ఉంది. అంటే తులం (8 గ్రాములు) ధర సుమారు ₹91,712గా ఉంది.
గతంతో పోలిస్తే తులానికి ₹1,000 వరకు పెరిగినట్లు ట్రేడర్లు పేర్కొంటున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. వెండి ధర గ్రాముకు ₹173.90గా ఉండగా, కిలో ధర ₹1,73,900గా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు ధరలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
