Home South Zone Telangana ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి కబ్జా |

ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి కబ్జా |

0

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారు 115/4 సర్వే నంబర్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

రూ. 10 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ ద్వారా చట్టబద్ధంగా మార్చినట్లు సమాచారం. అనంతరం ప్లాట్లు చేసి విక్రయించినా, సంబంధిత యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం.

ఈ వ్యవహారంపై జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూముల కబ్జా, నకిలీ పత్రాల వ్యవహారంపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా భూ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

NO COMMENTS

Exit mobile version