విజయవాడ
*వైసిపి అధినేత వైఎస్ జగన్ :*
25 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు
సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది
డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది
42 కుటుంబాలను 200 మంది పోలీసులు వచ్చి నిర్లక్ష్యంగా ఇల్లు కూల్చారు
పెద్దల సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా కూల్చారు
అధికార దుర్వినియోగం చేస్తూ అందరినీ రోడ్డు పాలు చేశారు
2.17 ఎకరాలు రూ.150 కోట్లు విలువైన భూమి ఇది
ఇందులో ప్రయివేటు వారు ఎంటర్ అయ్యారు
2016లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు
ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసి దోపిడీ చేశారు
జనసేన కార్పోరేటర్ కూడా ఇందులో భాగస్వామి
పోలీసులు అన్యాయస్తులకు మద్దతు ఇచ్చి ఇళ్ల కూల్చివేతకు కుసహకరించారు
25 ఏళ్లుగా ఉంటున్నారు
అన్ని రకాల అనుమతులు ఇచ్చారు కూడా
బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి
ఎన్నో ఏళ్లుగా ఈఎంఐలు కూడా కడుతున్నారు
స్థలం వేరే వారిది ఐతే అప్రూవల్ ఎలా ఇచ్చారు?
కరెంటు, డ్రైన్స్ ఎలా ఇచ్చారు?
బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు?
అన్నీ సవ్యంగా ఉన్నందునే ఇల్లు కట్టుకున్నారు
కొనుగోలు జరిగేటప్పుడు కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు
ఎవరూ అభ్యంతరం చెప్పలేదు
రూ.150 కోట్ల విలువైన స్థలం కబ్జా కోసం పేదలను రోడ్డున పడేశారు
ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోదా?
చంద్రబాబును మూడుసార్లు, లోకేష్ ని రెండు సార్లు కలిశారు
కానీ వాళ్ల మనుషులే కుట్ర పన్ని పేదలకు అన్యాయం చేశారు
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది
*సీబిఐ విచారణ జరిపించాలి*
పేదలకు వత్తాసు పలకకపోగా ప్రభుత్వమే కోర్టుకు వెళ్లింది
వారి రుణాలను ప్రభుత్వమే తీర్చాలి
స్థలం ఇక్కడే ఇస్తారా? మరోచోట ఇస్తారా?
మేము వచ్చాక విచారణ జరిపిస్తాం
బాధితులకు న్యాయం చేస్తాం
